లోకేష్‌ మంత్రి పదవి తో టీడీపీకిలాభమెంత.?


కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబెట్టారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. జాతీయ స్థాయిలో లోకేష్‌కి 'ఇమేజ్‌' తీసుకొచ్చేద్దామనుకుని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేశారాయన. కానీ, ఆ పదవిలో 'చినబాబు' ఒరగబెట్టిందేమీ లేదు. పైగా, తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేసేశాడన్న ఆరోపణలు 'బోనస్‌'గా లభించేశాయి. .
nararohith-news

మంత్రి పదవి పొందిన తరువాత నారా లోకేష్  చాల కష్టాలు పడుతున్నాడు ? ఏమిటి అనుకుంటున్నారా అదేనండి మన చిన్న బాబు తెలుగు మాట్లాడంలో చాలా కష్టపడుతున్నాడు . తండ్రి గారికి మంచి పేరు తెస్తాడు అనుకున్న చంద్రబాబు కి  ఇప్పుడు గుండలో రైలు పరిగెడుతున్నాయి . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు తనదైన శైలిలో ఇమేజ్ పెంచుకుంటా వెళ్తున్నాడు . అదే విధంగా మన ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊహించారు కానీ అది తీరడం లేదు . ఆ రాష్ట్ర ఐటీ మంత్రికి అన్ని భాషలు వస్తే మన రాష్ట్ర మంత్రికి ఒక్క తెలుగు బాషా మాట్లాడంలో గగనం అయిపోయింది . ఏమి జరుగుతుంది మరి చూడాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో జాబ్స్ కోసం చాల మంది వేచి ఉన్నారు మన రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉన్నారు . 

జనం కోసం జన సేన పడిగాపులు


గుంటూరు : చేనేత నేతల బాధలని తీర్చడానికి  ఉన్నాను అంటూ జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గుంటూరు లో జరిగిన సభకి హాజరు అయ్యారు. చేనేత సత్యాగ్రహానికి జనం భారీ సంఖ్యలో తరలి రాకపోవడంతో ప్రాంగణం వెలవెలబోయింది కనీసం 20 వేల మంది అయినా వస్తారన్న అంచనాతో గుంటూరు అర్బన్ పోలీసు శాఖ మూడు వందల మంది పోలీసులను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట సత్యాగ్రహానికి ఏర్పాటు చేసిన ప్రాంగణంలో బందోబస్తుకు నియమించారు. సభా ప్రాంగణం సామర్థ్యం రెండు లక్షలకు పైగా ఉంటుంది. అయితే సాయంత్రం నాలుగు గంటలకు కేవలం రెండు వేల మంది మాత్రమే ఉండటంతో పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించలేదు.ఎంతో భారీ ఆశలు పెట్టుకుని జన సేన నాయకులు నిరాశ పడిపోయారు. సభకు వచ్చే వాహనదారులను నేరుగా ప్రాంగణం వద్దకు అనుమతించారు. పవన్ కల్యాణ్‌ సభా ప్రాంగణానికి చేరే సమయానికి మూడు వేలకు మించి ప్రజలు లేరు. దీంతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
సభకు హాజరైన ప్రజల్లో సగం మంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులు. జనసేన కార్యకర్తలే. జనం హాజరు పలచగా ఉండటాన్ని సభలో చేనేత నేతలు శ్రీనివాసరావు, మూర్తి కూడా ప్రస్తావించారు. సభకు జనం రాకుండా చేయడంలో ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. చేనేత సత్యాగ్రహానికి పవన కల్యాణ్‌ మద్ధతిచ్చినప్పటి నుంచి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెడుతోన్నాయని, సభ జరగకుండా చేసేందుకు ఎన్నో ఆటంకాలు కల్పించారని ఆరోపించారు. జనం పలచగా వచ్చినా పవన కల్యాణ్‌ ఒక్కరు కోటి మందితో సమానమని వ్యాఖ్యానించారు.
సభకి ప్రజలు రాకపోవడం కారణం పవన్ కళ్యాణ్ మాటల్లో నిజంలేదు అని అధికార పక్ష పార్టీలు అంటున్నారు అందుకే ప్రజలు ఆ సభ కి హాజరు కాలేదు అని వాఖ్యానించారు 

Block Money


బ్లాక్ మనీ  ఫై మోడీ నిర్ణయం 

అమరావతి: మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ .500 నుంచి రూ .1,000 కరెన్సీ అర్ధరాత్రి నుంచి అక్రమ గమనికలు ప్రకటించారు నల్లధనం తగ్గిస్తుంటే తీవ్రమైన చర్యలను ప్రకటించింది.
ప్రభుత్వం కొత్త రూ జారీ రెడీ 500 మరియు రూపాయలు 2,000 గమనికలు వెంటనే, అతను చెప్పాడు.
బ్యాంకులు బుధవారం, నవంబర్ 9 న మూసి ఆదేశించవచ్చు.
ఇది మీ కోసం అంటే వద్ద ఒక లుక్:

** మీరు ఏ పరిమితి లేకుండా పాత 500 రూపాయలు మరియు బ్యాంకులు / పోస్టాఫీసులో రూ .1,000 గమనికలు నవంబర్ 10 నుండి ఖాతాల డిసెంబర్ 30, 2016 వరకు, డిపాజిట్ చేయవచ్చు.

** రూ 10,000 ఒక రోజు, మరియు ఒక వారం రూ .20,000 బ్యాంకులు, తపాలా కార్యాలయాలు నుండి ఉపసంహరణ పరిమితి ఉంటుంది. పరిమితి రాబోయే రోజుల్లో పెంచుతారు.

** మీరు ప్రూఫ్ ID చూపిస్తున్న ఈ పరిమితిని రూ .4,000 నవంబర్ 24, 2016 వరకు, ఏ బ్యాంకు, పోస్టాఫీసు లేదా ఉప పోస్ట్ ఆఫీస్ వద్ద రూ 500 / రూ 1,000 నోట్లు మార్పిడి చేయవచ్చు.

** ఎటిఎంల నవంబర్ 9 (బుధవారం) పని కాదు మరియు నవంబర్ 10 న కొన్ని ప్రదేశాలలో.

** వారి ATM నుండి ఉపసంహరణల రూ 2,000 / కార్డు రోజుకు పరిమితమై ఉంటుంది. ఈ తరువాత రూ .4,000 పెంచుతారు

** 72 గంటల పాటు కింది సేవలను రూ 500 / రూ 1,000 నోట్లను ఆమోదించడానికి ఉంటుంది:

ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్రభుత్వం బస్సులు మరియు టికెట్ కౌంటర్లు విమానాశ్రయాలలో.

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు అధికారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్లు.

కన్స్యూమర్ సహకార దుకాణాలు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, crematoria మరియు ఖననం మైదానంలో ద్వారా అధికారం పాల బూత్లు ద్వారా అధికారం.

బాహుబలి-2 క్లైమాక్స్?

బాహుబలి-2 క్లైమాక్స్?

bahubali2-images
హైదరాబాద్:  టాలీవుడ్ లో భారీ చిత్రం అంటే ముందుగా మనకి గుర్తువచ్చేది "బాహుబలి " ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో రికార్డులు క్రియేట్ చేసిన, తెలుగు సినిమా రంగానికే  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఖ్యాతిని చాటిన తెలుగు ప్రజలు గౌరవంగా చెప్పుకోదగిన  చిత్రం ‘బాహుబలి’ . ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి జులై 10, 2015 న  తెర‌కెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘బాహుబలి ద కన్‌క్లూజన్’ క్లైమాక్స్ షూటింగ్ ఈ సంవత్సరం  ఆగస్టులో పూర్తిచేసుకోనుంది. జూన్ 13న క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించిన జక్కన  శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేస్తున్నారు. ఈ పార్ట్ సినిమాకే హైలెట్ కానుందని బాహుబలి కంటే అద్భుతవం గా ఉంటుంది అని  తెలుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో యుద్ద సన్నివేశాలను రూపొందిస్తున్నారు. సినిమాలో కీలకమైన క్లైమాక్స్ సీన్లను రాజమౌళి ప్రతిష్టాత్మకంగా గుర్తుఉండే విధంగా  తెరకెక్కిస్తున్నారు. ఈ క్లైమాక్స్ సన్నివేశాల దాదాపు గా  రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. "బాహుబలి" తొలి భాగం క్లైమాక్స్ కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టగా అంత భారీ అంచనాలికి మించి ఆ చిత్రం వాసులు చేసింది అని . దానికి రెండింతల ఖర్చును రెండో భాగానికి వెచ్చిస్తున్నారు అని దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది అని భావిస్తున్నారు . అమెరికా మరియు హాలీవుడ్ స్టూడియోస్ నుంచి వచ్చిన టాప్ టెక్నీషియన్లతో ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది జక్కన్న యూనిట్. ఈ సంవత్సరం ఆగస్టులో చిత్రీకరణ పూర్తిచేసుకుని. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోనుంది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సంవత్సరం వేసవి కాలం లో ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా జక్కన్న  పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు అని కధనాలు . ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ు చేసి రికార్డులకెక్కి జాతీయ అవార్డు,మరియు మరి ఎనో అవార్డ్స్ పొందిన  ఈ చిత్రం సీక్వెల్‌తో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే. బాహుబలి కె అంకితం అయినా ప్రభాస్ ఈ  షూటింగ్ పూర్తికాగానే ప్రభాస్ సినిమాలతో బిజీ కాబోతున్నాడు అని . యంగ్ డైరెక్టర్ సుజిత్ సినిమా కోసం డిసెంబర్‌ నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతున్నాడు అని సినిమా రంగం చెబుతుంది .

Amaravati Telugu News, Andhra Pradesh News, Bahubali2 Latest News, Bahubali News.

మహేష్ సరసన రకుల్ !

మహేష్ సరసన రకుల్ !

rakul-mahesh-images
హైదరాబాద్:  తెలుగు సినిమా రంగంలో బడా హీరోలు అంటేనే మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ అని అంటారు కానీ ఈ ఇద్దరు గత సినిమాలో ఫ్యాన్స్ మోపుని పొందలేక పోయారు. ఫ్యాన్స్ కోసం మంచి సినిమా ఇవ్వాలి అని ఈ బడా హీరోలో తెగ ఆరాటపడిపోతున్నారు ఆ  విషయంలో పవన్ కళ్యాణ్ ఇంతక ముందు సినిమా  పూజ కార్యక్రము కూడా చేశారు కానీ ఇంకా సెట్స్ పై కి రాలేదు. అదే రీతిలో మహేష్ బాబు కూడా రడీ అవుతున్నాడు అంత అదే నండి  మహేశ్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నడి అని సినిమా పరిశ్రమలో అంటున్న  సంగతి తెలిసిందే. ఈ నెల 15న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుందట అని వర్గాలు చెబుతున్నాయి .  బ్రమోత్సవం సినిమా తరువాత వస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి మంచి కధ ను ఇవ్వాలి అని అయితే ఈ చిత్రంలో నటించే నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక చేయడం ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాలో మహేశ్ సరసన బాలీవుడ్ భామ పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్లు. కానీ ఆమెకు పారితోషికంగా రూ.3.5కోట్లు ఆఫర్ చేసినట్లు టాలీవుడ్‌‌లో ప్రచారం జరిగింది. అయితే టాలీవుడ్ లో మంచి కేజ్రీ పొందిన  ఆమె అంటూ ఒక  ప్లేస్‌ను వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్‌సింగ్ రీప్లేస్ చేసిందని  సమాచారం. ఇప్పటికే  ఈ చిత్ర యూనిట్ రకుల్‌ను సంప్రదించినట్టు  ఆమెకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించడం జరిగిపోయినట్లు కధనాలు వస్తున్నాయి. ఈ సినిమాకి  ఆమెనే దాదాపు ఖరారు చేసే అవకాశాలున్నాయి.   ‘బహ్మోత్సం’లో మహేశ్ పక్కన నటించే ఛాన్స్  రకుల్‌కు ఇంతకు ముందే వచ్చింది అని అయితే తనకి  డేట్స్ సర్దుబాటు లేక ఆ అవకాశాన్ని ఈ  అందాల భామ  వదులుకుంది అని!. తాజాగా మరోసారి ఈ అవకాశం రావడంతో రకుల్ ఎంతో ఆనందం గా ఉన్నట్లు తెలుస్తోంది. హరీస్ జైరాజ్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఠాగూర్ మధు నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రలో తెరకెక్కబోతోంది.సినిమా రంగంలోని కధనాలు!.

Amaravati Telugu News, Telugu Cinema News, Tollywood News, Rakul Latest News, Mahesh Latest News, Tollywood News.

ఏపీ కాపీపై దీటుగా స్పందిస్తాం తెలంగాణ ప్రభుత్వం!

ఏపీ కాపీపై దీటుగా స్పందిస్తాం తెలంగాణ ప్రభుత్వం!

ap copy ts

తెలంగాణ : ఒక స్కూల్ లో జరిగిన ఎక్సమ్ లో కాఫీ కొట్టారు అని టీచర్లు అంటారు లేదు నేను కాఫీ కొట్టలేదు అని విద్యార్థులు అనడం  చాలా స్కూల్లో జరుగుతాయి అలాగే  ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ప్రభుత్వం రగడ జరుగుతుంది.   గత రెండు రోజుల నుంచి తెలంగాణ కాపీ పై పెట్టిన కేసులకు స్పందించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం "ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌" బిజినెస్ పై తెలంగాణ సమాచారాన్ని ఏపీప్రభుత్వం కాపీ కొట్టిందన్న విషయం పక్కాగాఆధారాలు ఉన్నాయి అని తెలంగాణ  టి-పరిశ్రమల శాఖ తెలిపింది. ‘ఏపీ కాపీ’పై తాము దీటుగా స్పందిస్తామని పక్క ఆధారాలు  స్పష్టం చేస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో తెలంగాణ అధికారులు చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొంటున్న అక్కడి అధికారులను ఏపీ సర్కారు బెదిరింపులకు గురి చేస్తోందని. తెలంగాణ ప్రభుత్వం పెట్టే కేసులు, నోటీసులపై ఎవరూ స్పందించవద్దంటూ ఆదేశాలు జారీ చేసిందని. అధికారులెవ్వరూ నోరు మెదపవద్దంటూ ఏపీ ఆదేశాలు జారీ చేసిందంటేనే.. ఈవోడీబీ సమాచారాన్ని ఆ రాష్ట్రం దొంగిలించిందని నిర్ధారణ అయినట్లని తెలిపింది.మరి ఈ రెండు రాష్ట్రాల మధ్య రగడ ఎలా సర్దుమణుగుతుందో చూడాలి . గత సంవత్సరం తమ రాష్ట్రానికి 2 ర్యాంకు వచ్చిందని, 13వ ర్యాంకులో ఉన్న తెలంగాణ సమాచారాన్ని ఎలా కాపీ కొడతామంటూ ఏపీ చేస్తున్న వాదనలను పరిశ్రమల శాఖ ఖండించింది. ఈసారి డ్యాష్‌ బోర్డులో ఏపీ రాష్ట్రం ఎప్పుడూ అగ్రస్థానంలో లేదని, ప్రతిసారీ తెలంగాణ రాష్ట్రమే మొదటి 3 స్థానాల్లో నిలుస్తూ వచ్చిందని వివరించింది. ఈసారి అధమ స్థానంలో ఉన్న ఏపీ ఒకేసారి మూడో ర్యాంకులోకి ఎలా వచ్చిందో అన్న విషయాన్ని చెప్పకుండా.. గత సంవత్సరపు ర్యాంకుల ఆధారంగా సమర్థించుకోజూస్తోందని ఆరోపించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. ఈమేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇరు రాష్ట్రాల కమిషనర్లు, వెబ్‌ అప్లికేషన సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ జేడీ సురేష్‌, రాష్ట్ర సర్వీస్‌ ప్రొవైడర్‌ ‘ఫక్స్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నిర్వాహకులు విచారణకు హాజరయ్యారని, సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన తేదీలు, ఇతర సమాచారాన్ని పోలీసులకు అందించారని తెలిపింది. ఎవరిని వదిలి పెట్ పరిస్థి లేదు అంటూ ఆ రాష్ట్ర అధికారులు తెలియచేశారు.
కాపీ చేయలేదని చెప్పిన ఏపీ సర్కారు నిజంగా ఏ పాపం చేయకపోతే విచారణకు సిద్ధం కావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్కసుమన్‌ సవాల్‌ చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ అధికారులు రూపొందించిన ఆన్లైన్ అప్లికేషన్లను చోరీ చేసి ఈవోడీబీ స్పూర్తిని దెబ్బతీసిన ఏపీ సర్కారుపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర అధికారులు మంత్రులు డిమాండ్‌ చేశారు.మరి దీని పై ఏ విధంగా ఏపీ ప్రభత్వం స్పందిస్తుందో చూడాలి 

చైతు,సమంత ల వివాహం !

చైతు,సమంత ల వివాహం !

samantha and chithu love images

హైదరాబాద్:  తెలుగు సినిమా రంగంలో వస్తున్న వార్తలకి కరెక్ట్ గా సమాధానంగా నిలిచిన ఓ సినీ హీరో చైతు సమంత . గత కొన్ని రోజుల నుండి వస్తున్న పుకారులు నిజమైయాయి. అదే నండి ఆ ఇద్దరు పెద్దల సమక్షలో పేలడుతున్నారు అంత  సమంత, అక్కినేని వారబ్బాయి నాగచైతన్య పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారా ? త్వరలోనే కార్తీక్, జెస్సీ పెళ్లి చేసుకోబోతున్నారా ? కొంతకాలంగా వీరిద్దరి వ్యవహార శైలి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజులుగా న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియాలో  చైతూ, సమంత ప్రేమ వ్యవహారంపై కోడై కూస్తున్నాయి. అక్కినేని వారింట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయని కొందరు, అఖిల్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని మరికొందరు ఇలా విస్తృత ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా సమంత శనివారం ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘కారణాలేమిటో నాకు తెలుసు, ఏం చేయాలో , ఎప్పుడు చెప్పాలో కూడా నాకు తెలుసు. ఆ విషయాన్ని నేనే త్వరలో వెల్లడిస్తాను. ఈ విషయం గురించి మాట్లాడుతున్న వారందరికీ ఇదే నా సమాధానం’ ఇది అని సమంత పోస్ట్ చేసింది. అయితే వీరిద్దరి లవ్ స్టోరీపై వస్తున్న వార్తలనుద్దేశించే సమంత ఈ ట్వీట్స్ చేసినట్లు తెలుస్తోంది.ఇంతక ముందు మీడియా తో నేను ఒకరిని లవ్ చేస్తున్న అని అతని పేరు మొదటి అక్షరం "ఎన్ " తెలియచేసింది పరోక్షంగా ఈ విషయంపై స్పందించిన సమంత బహిరంగంగా ఎప్పుడో ప్రకటిస్తుందోనని సినీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Amaravati Telugu News, Telugu News, Amaravati News,Today AP News, Movie Telugu News,Amaravati Latest News.

లోకేష్‌ మంత్రి పదవి తో టీడీపీకిలాభమెంత.?

కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబె...